Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
భారతీయ తపాలా శాఖ వారు కమిషన్ ఆధారంగా తపాలా జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత భీమా పాలసీలు సేకరించడానికీ ఏజెంట్లను నియమిస్తున్నట్టు సికింద్రాబాద్ తపాలా సీనియర్ సూపరింటెండెంట్ కే సంతోష్ నేత మంగళవారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపారు 10వ తరగతి పాస్ అయ్యి 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉన్న నిరుద్యోగ యువత, మాజీ జీవిత సలహాదారులు, ఏదైనా బీమా కంపెనీ మాజీ ఏజెంట్లు, మాజీ సైనిక ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు, హైదరాబాద్ సిటీ ప్రాంతంలో ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను సికింద్రాబాద్ డివిజనల్ ఆఫీస్, గాంధీనగర్కు జూన్ 10వ తేదీ లోపు పంపాలని కోరారు. ఎంపిక కాబడిన అభ్యర్థులు జూన్ 15వ తేదీ ఉదయం 10 గంటలకు సంబంధిత సర్టిఫికెట్స్తో ఇంటర్వ్యూకు హాజరు కావాలని తెలిపారు. ఏజెంటుగా నియమితులైనవారు, సెక్యురిటి డిపాజిట్ రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు.