Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాజ్యసభ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు దీవకొండ దామోదర్రావు, బండి పార్థసారధిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం హైదరాబాద్లోని అసెంబ్లీలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, మల్లారెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వారు కలిసి నామినేషన్లను దాఖలు చేశారు. రాజ్యసభ అభ్యర్థులకు వారు అభినందనలు తెలిపారు. ఈనెల 31న నామినేషన్ల గడువు ముగియనుంది. తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు వచ్చే నెల 21తో పదవీకాలం ముగియనున్న విషయం తెలిసిందే.