Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో రైతులకు అధిక ఉత్పాదకత, లాభసాటిగా ఉండేందుకు వీలుగా సింగిల్ పిక్ కాటన్ సాగను ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చెప్పారు. ఇదే అంశంపై బుధవారం హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో ఆయన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఉత్పాదకతను పెంపొందించడంతోపాటు రాష్ట్రంలోని రైతులకు అధిక ఆదాయం లభించేలా సింగిల్ పిక్ పత్తిని ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు సాగు ప్రోత్సహించాలని కోరారు. సింగిల్ రకం పత్తి 40 శాతం అధిక దిగుబడిని అందిస్తుందనీ, పలు దేశాలు కూడా ఈ రకమైన పత్తి పంటను సాగు చేస్తున్నాయని వివరించారు. ఈ పత్తి సాగుకు సరిపడా విత్తనం అందుబాటులో ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా 45వేల ఎకరాల్లో సింగిల్ పిక్ పత్తిని సాగు చేయించాలని అధికారులను ఆదేశించారు. గతంలో విత్తన కంపెనీల ద్వారా ట్రయల్స్ నిర్వహించిన ఆయా ప్రాంతాల్లో పత్తి ఏరియా విస్తరణను చేపట్టాలన్నారు. పత్తి వేయడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో రైతుల్లో అవగాహన కల్పించాలని సూచించారు.హెచ్డీపీఎస్ (హై-డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం) టెక్నాలజీని ప్రోత్సహించేందుకు విత్తన కంపెనీల సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వ్యవసాయ విస్తరణ అధికారుల సమావేశం నిర్వహించి, సింగల్ పిక్ పత్తిని సాగు చేసే రైతులను నమోదు చేయించాలని సూచించారు. దీనికోసం రైతు ప్రొఫైల్, వర్షపాతం వివరాలు, పంటల క్యాలెండర్ తదితర వివరాలతో కూడిన యాప్ను రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్యదర్శి ఎం రఘునందన్రావు, పీజేటీఎస్ఏయూ వీసీ ప్రవీణ్రావు, స్పెషల్ కమిషనర్ అగ్రికల్చర్ హనుమాన్ కె జెండగే, ఉద్యానవన కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.