Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈఎస్ఐ ఆధ్వర్యంలో మల్లు వెంకట నర్సింహారెడ్డి మెమోరియల్ ప్రజా వైద్యశాలలో ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్లోని నవతెలంగాణ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఆస్పత్రిలో బుధవారం ఈ కార్యక్రమాన్ని ఆస్పత్రి జనరల్ మేనేజర్ వి.లింగారెడ్డి, నవతెలంగాణ హెచ్ఆర్ (జీఎం) ఎం.సుబ్బారావు, ఎడిటోరియల్ బోర్డు నుంచి ఆనందాచారి, నవతెలంగాణ జీఎం ఎ.వెంకటస్వామి ప్రారంభించారు. ఈఎస్ఐ సనత్ నగర్ నుంచి వచ్చిన సిబ్బంది, నవతెలంగాణ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వంద మంది వరకు ఈసీజీ, షుగర్, బీపీతో పాటు జనరల్ చెకప్ చేశారు. అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు. పరీక్షల నిర్వహణలో ప్రజావైద్యశాల సిబ్బంది సహకరించారు. ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం పట్ల నవతెలంగాణ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈఎన్టీ, ఆర్థ్రో, కార్డియాలజీ తదితర ప్రత్యేక విభాగాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణ కోసం కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఈఎస్ఐ బ్రాంచ్ మేనేజర్ స్రవంతి అనూష, అసిస్టెంట్ జి.సుశీల, సనత్నగర్ సిబ్బంది డాక్టర్ స్వామి, డాక్టర్ ఖైజర్, ఫార్మసిస్ట్ జయశ్రీ, ఈసీజీ టెక్నీషియన్ భాస్కర్, స్టాఫ్ నర్సులు ప్రియదర్శినీ, షిరీన్తో పాటు ప్రవీణ్, రమాదేవి, డ్రైవర్ శ్యామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.