Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్నిచోట్లా అరుణపతాకాలను ఆవిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సెంటర్స్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 30న పారిశ్రామిక వాడలు, కూలీల అడ్డాలు, మండల, జిల్లా కేంద్రాలతో పాటు హైదరాబాద్లో అరుణపతాకాలను ఎగురవేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్కరాములు, పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో ఆ యూనియన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ...కార్మికులను రాజకీయంగా చైతన్యవంతం చేసి పెట్టుబడిదారీ వ్యవస్థ వ్యతిరేక పోరాటాలకు వారి మద్దతును సమీకరించడానికి ఐక్యత-పోరాటం నినాదంతో సీఐటీ యూ ఆవిర్భవించిందన్నారు. నిర్ణయా త్మక పోరాటాల్లో తమ సంఘం ముందు వరుసలో ఉంద న్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. కోటంరాజు, జె.మల్లిఖార్జున్, పి.రాజా రావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్వీ రమ, రాష్ట్ర కోశాధికారి వంగూరు రాములు, రాష్ట్ర కమిటీ సభ్యులు యాటల సోమన్న, కూరపాటి రమేశ్, పి.సుధాకర్, పి.శ్రీకాంత్, పాల్గొన్నారు.