Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
పదో తరగతి వార్షిక పరీక్షలకు శుక్రవారం 99.06 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. జనరల్ సైన్స్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 5,08,143 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 5,03,344 (99.06 శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారని వివరించారు. 4,799 (0.94 శాతం) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. 566 మంది ప్రయివేటు విద్యార్థులు దరఖాస్తు చేయగా, 368 మంది విద్యార్థులు హాజరయ్యారనీ, 198 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ముగ్గురు విద్యార్థులపై మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు చేశామని వివరించారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.