Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన
- రాష్ట్రానికి దాదాపు రూ.4200 కోట్ల పెట్టుబడులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈనెల 18 లండన్ కు చేరుకున్న ఆయన, యూకేతో పాటు స్విట్జర్లాండ్లో నిర్వహించిన సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోని 45 ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పెట్టుబడి అవకాశాలతో పాటు మన ప్రభుత్వ విధానాలను, పారిశ్రామిక విధానాలను వారికి వివరించారు. ఆయన కేటీఆర్ కృషి ఫలితంగా సుమారు రూ.4,200 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి.
ఈ క్రమంలో ఈసారి భారతదేశం నుంచి దావోస్ లో పాల్గొన్న పలు రాష్ట్రాల పెవిలియన్లతో పోల్చినపుడు తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత దేశానికి చెందిన అనేక కంపెనీల ప్రతినిధులతో పాటు పలు అంతర్జాతీయ మల్టీ నేషనల్ కంపెనీల ప్రతినిధులు తెలంగాణ పెవిలియన్ను ప్రశంసించారు. అక్కడ కేటీఆర్ సమావేశాలతో పాటు పలు చర్చాగోష్టులకు వేదికగా మారింది. ముఖ్యంగా మంత్రి కే.తారకరామారావు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్ ప్రధాన సమావేశ మందిరం, ఇండియా పెవిలియన్, సిఐఐ పెవిలియన్లలో జరిగిన చర్చలు, తెలంగాణ పెవిలియన్లో జరిగిన ఫార్మా లైఫ్ సైన్స్, దేశంలోని ప్రముఖ యూనికార్న్ వ్యవస్థాపకుల్లో జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఆయా చర్చల్లో వెలిబుచ్చిన అభిప్రాయాలకు ప్రశంసలు లభించాయి.
ప్రపంచ వేదిక పైన తెలంగాణ ప్రభుత్వ విధానాలతో పాటు, పెట్టుబడి అవకాశాలను చాటడంలో ఈ పర్యటన ఎంతగానో దోహదపడిందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల పట్ల సంతప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటన విజయవంతానికి కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, పలు వ్యాపార వాణిజ్య సంస్థలు, ముఖ్యంగా యూకే, స్విట్జర్లాండ్ దేశాలకు చెందిన ఎన్నారైలకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.
జడ్ కంపెనీతో సమావేశమైన మంత్రి కేటీఆర్
మంత్రి జ్యూరిచ్ నగరంలో జడ్ఎఫ్ కంపెనీతో సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆ కంపెనీ రాష్ట్రంలో తన విస్తరణ ప్రణాళికలను ప్రకటించింది. ఈ మేరకు జూన్ ఒకటవ తేదీన తన కార్యాలయాన్ని నానక్రాంగూడలో ప్రారంభిస్తున్నట్టు మంత్రి కేటీఆర్ కు తెలిపింది.