Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆలస్య రుసుంతో జులై 7 వరకు సమర్పణకు అవకాశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ఆలస్య రుసుం లేకుండా శనివారంతో ముగిసింది. ఈ మేరకు ఎంసెట్ కన్వీనర్ ఎ గోవర్ధన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు అగ్రికల్చర్ విభాగానికి 88,156 మంది, ఇంజినీరింగ్ విభాగానికి 1,61,552 మంది కలిపి మొత్తం 2,49,708 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఆలస్య రుసుం రూ.250తో వచ్చేనెల ఏడు, రూ.500తో 17, రూ.2,500తో 27, రూ.ఐదు వేలతో జులై ఏడో తేదీ వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశముందని తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగం అభ్యర్థులకు జులై 14,15 తేదీల్లో, ఇంజినీరింగ్ విభాగం అభ్యర్థులకు అదేనెల 18,19,20 తేదీల్లో ఎంసెట్ రాతపరీక్షలు ఆన్లైన్లో జరగనున్నాయి. ఎంసెట్ను 23 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 105 పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తారు.