Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కెరమెరి
అటవీ జంతువుల వేటకు అమర్చిన తీగలు తగిలి కాడెద్దులు మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కేలి(బి) గ్రామ సమీపంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం..
పర్సువాడ గ్రామానికి వెళ్లే దారిలో ఎవరో అడవి జంతువుల వేట కోసం విద్యుత్ తీగలు అమర్చారు. కేలి(బి) గ్రామానికి చెందిన భీంరావు శుక్రవారం వ్యవసాయ పనులు ముగించుకొని ఎడ్ల బండిపై ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో పర్సువాడకు వెళ్లే గుట్ట ప్రాంతంలో దారిలో అమర్చిన తీగలు ఎద్దులకు తగిలాయి. ఎడ్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. బండిపై ఉన్న భీంరావు, సోదరి కుమారుడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.