Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయిన్పల్లి వినోద్కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టాటా ఇన్ట్సిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్), హైదరాబాద్, నేషనల్ ఇన్ట్సిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్ఐయూఏ) న్యూఢిల్లీ సంయుక్త భాగస్వామ్యంతో రెండు ఎడ్యుకేషన్ కొత్త ప్రోగ్రాం ఆవిష్కరించాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైఎస్ చైర్మెన్ బోయిన్పల్లి వినోద్కుమార్ తెలిపారు. ఈ రెండు కొత్త విద్యా ప్రోగ్రామ్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. ఆదివారం హైదరాబాద్లో ఆయా సంస్థల డైరెక్టర్లు, ఇతర అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ హైదరాబాద్ శరవేగంగా ఎడ్యుకేషనల్ హబ్గా ముందుకు సాగుతోందన్నారు. పట్టణీకరణ ప్రస్తుత కాలంలో పెద్ద సవాలుగా మారిందనీ, ఈ సవాళ్లను కోర్సుల ద్వారా మంచి పరిష్కార మార్గం సూచించే అవకాశాలుంటాయని పేర్కొన్నారు. ప్లానింగ్, ఇన్స్టిట్యూషన్స్, సిటీ ఫైనాన్స్, డేటా అనలిటిక్స్, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ వంటి ఐదు ప్రధాన అంశాలపై పీజీ కోర్సు ఆవిష్కరించడం గొప్ప విషయమని తెలిపారు.