Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పెంచిన చమురు, గ్యాస్,నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ధరల పెరుగుదలకు నిరసనగా వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపులో భాగంగా నేడు రాష్ట్రవ్యా ప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. మే 31న హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద జరుగు ధర్నాలో పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చమురు, నిత్యవసర వస్తువులు ధరలు విపరీతంగా పెరిగిపోయాయని తెలిపారు. మోడీ ప్రభుత్వం చమురు కంపెనీలకు కీలుబొమ్మలా మారిందని పేర్కొన్నారు.