Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ రఘునందన్రావు పేర్కొన్నారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారంలో ఉత్పత్తిని నిలిపేయాలంటూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు. ఆ కర్మాగారాన్ని త్వరితగతిని పునరుద్దరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న 4.52 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు అదనంగా జూన్ నాటికి 1.75 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని తెలిపారు. అందువల్ల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.