Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు 2.94 లక్షల మంది దరఖాస్తు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ఇంకా ఒక రోజే గడువున్నది. అంటే మంగళవారంతో దరఖాస్తు గడువు ముగియనుంది. ఇప్పటి వరకు 2,94,644 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు అవకాశమున్నదని పేర్కొన్నారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,68,658 మంది, సవరణ చేసుకున్న వారు 3,45,841 మంది కలిపి మొత్తం 5,14,499 మంది అభ్యర్థులు వివరాలను అప్లోడ్ చేశారని వివరించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.