Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ ఎనిమిదేండ్ల పాలన సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోడీకి ఎనిమిది ప్రశ్నలు వేశారు. మహిళలకు ఏంచేశారు? మహిళా రిజర్వేషన్ ఏమైంది? అని నిలదీశారు. గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు ఎందుకు పెంచుతున్నారని అడిగారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా ఎందుకు పక్షపాతం వహిస్తున్నారని ప్రశ్నించారు. అచ్చేదిన్ ఎక్కడకు పోయిందన్నారు. రైతుల గురించి పట్టదా? అని నిలదీశారు. పీఎం కేర్స్ దేశ ప్రజలకు నిధుల గురించిన నిజమైన సమాచారం ప్రజలకు తెలియజేసే రోజు వస్తుందా? అని ప్రశ్నలు వేశారు.