Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొండపాక
సివిల్ సర్వీసెస్ 2021 పరీక్ష ఫలితాల్లో సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రానికి చెందిన బుద్ధి నరేష్- లత కుమారుడు అఖిల్కు జాతీయ స్థాయిలో 566 ర్యాంకు వచ్చింది. అఖిల్ ఒకటో తరగతి నుంచి 7తరగతి వరకు కొండపాకలోని సాయి పబ్లిక్ స్కూల్, 8 నుంచి 10 తరగతి వరకు సిద్దిపేటలోని రవీంద్ర హైస్కూల్, ఇంటర్ సిద్దిపేటలోని మాస్టర్ మైండ్స్, ఇంజనీరింగ్ కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. అనంతరం స్వంతంగా ప్రిపరేషన్ అయి 2021 జనవరిలో పరీక్ష రాయగా సోమవారం విడుదలైన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాల్లో 556వ ర్యాంకును సాధించారు. అఖిల్ మొదటి రెండు ప్రయత్నాల్లో ఇంటర్వ్యూ వరకు వెళ్లి అవకాశం కోల్పోయినా.. మూడో ప్రయత్నంలో ర్యాంక్ సాధించారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ జాగృతి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు అనంతుల ప్రశాంత్ అఖిల్ను శాలువా కప్పి సన్మానించారు. అఖిల్కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.