Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్ ప్రీస్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్ఈ) కోర్సుల్లో 2022-24 బ్యాచ్ ప్రవేశాల కోసం డీసెట్కు అభ్యర్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ మేరకు డీసెట్ కన్వీనర్ శ్రీనివాసాచారి మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 30వ తేదీ వరకు ఉందని పేర్కొన్నారు. ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఎస్సీ,ఎస్టీలకు 45 శాతం, ఇతరులకు 50 శాతం మార్కులు వచ్చినోళ్లే దరఖాస్తు చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. అభ్యర్థులకు సెప్టెంబర్ ఒకటి నాటికి కనీసం 17 ఏండ్లు నిండి ఉండాలనీ, దీనికి గరిష్ట వయోపరిమితి లేదని వివరించారు. తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మాధ్యమాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నామని తెలిపారు. డీపీఎస్ఈలో ప్రవేశం పొందాలంటే ఇంగ్లీష్ మాధ్యమంలోనే చదవాలని కోరారు. జులై 23న రాతపరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ఇతర వివరాలకు http://deecet.cdse.telangana.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.