Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన గ్రూప్-1 దరఖాస్తు గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువు మంగళవారం అర్థరాత్రితో ముగిసింది. మంగళవారం రాత్రి ఎనిమిది గంటల వరకు 3,44,042 దరఖాస్తులొచ్చాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. గతనెల 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు ఈనెల 31వ తేదీ వరకు అవకాశమున్నదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 503 పోస్టులకుగాను 3,44,042 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,83,089 మంది, సవరణ చేసుకున్న వారు 3,71,994 మంది కలిపి మొత్తం 5,55,083 మంది అభ్యర్థులు వివరాలను అప్లోడ్ చేశారని వివరించారు.
ఇతర వివరాలకు షషష.్రజూరష.స్త్రశీఙ.ఱఅ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. వన్టైం రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కంటే గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడం గమనార్హం. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు దరఖాస్తు గడువును పొడిగించేందుకు టీఎస్పీఎస్సీ అధికారులు ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.