Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మట్టి వినాయక విగ్రహాల మార్కెటింగ్కు తగిన ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్లోని బీఆర్కె భవన్లో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యకారక గణేష్ విగ్రహాలను ఉపయో గించొద్దని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హానికారక రసాయనాలను విగ్రహాల తయారీలోని కోర్టు నిషేధించిందని గుర్తుచేశారు. పీఓపీతో తయారు చేసిన విగ్ర హాలను ట్యాంక్ బండ్తో పాటు నగరంలోని ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.