Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూన్ 25 నాటికి ఫలితాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు బుధ వారంతో ముగియనున్నాయి. గతనెల 23 నుంచి ఈ పరీక్షలు ప్రారం భమైన విషయం తెలిసిందే. గతనెల 28న ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ముగిశాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణా రావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. మంగళవారం ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2 పరీక్షకు 153 మంది దరఖాస్తు చేసు కున్నారనీ, వారిలో 150 (98.04 శాతం) మంది హాజరయ్యారని పేర్కొ న్నారు. ముగ్గురు విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. బుధవారం చివరిరోజు ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో గురువారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యా ంకనం ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 నాటికి పదో తరగతి ఫలితాలు విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.