Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డులో 2009 నుంచి నమోదు చేసుకున్న కార్మికుల మ్యానువల్ కార్డులను కార్మిక శాఖ అధికారులే ఆన్లైన్ ప్రక్రియలో నమోదు చేయించాలని తెలంగాణ బిల్డింగ్, అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వంగూరు రాములు, ఆర్.కోటం రాజు,ఉపాధ్యక్షులు ఎస్.రామ్మో హన్ డిమాండ్ చేశారు. నిర్మాణ రంగంలోని కార్మికుల పెండింగ్ సమస్యలను పరిష్కరిం చాలని కోరారు. మంగళవారం హైదరాబా ద్లోని కార్మిక శాఖ కార్యాలయంలో వెల్ఫేర్బోర్డు కార్యదర్శి గంగాధర్కు వినతిపత్రాన్ని అందజేశారు. కార్డులను ఆన్లైన్ చేయకపోవడం వల్ల కార్మికులకు నష్టపరిహారం అందటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల వివాహాలు, ప్రసూతి కానుకలు, ప్రమాదవశాత్తు మరణించిన కార్మికులకు రావాల్సిన పరిహారం కోసం దరఖాస్తు పెట్టుకుంటే కార్డులు ఆన్లైన్ కాలేదనే పేరుతో అధికారులు తిరస్కరిస్తున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మాన్యువల్ కార్డులను ఆన్లైన్ చేయించే బాధ్యతను కార్మిక శాఖ అధికారులే తీసుకోవాలని కోరారు.