Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముగిసిన పరీక్షలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు సంబంధించిన పరీక్షలు బుధవారంతో ముగిశాయి. గతనెల 23 నుంచి ఈ పరీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే.గతనెల 28న పదో తరగతి విద్యార్థులకు ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు ముగిశాయి.ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. చివరిరోజు ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్సు (థియరీ) పరీక్ష నిర్వహించామని తెలిపారు.ఈ పరీక్షకు 26,417 మంది దరఖాస్తు చేసుకున్నారనీ, వారిలో 25,504 (96.40 శాతం) మంది హాజరయ్యారని పేర్కొన్నారు. 913 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాల్లో గురువారం నుంచి పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ ప్రారంభం అవుతుందని వివరించారు. ఈనెలాఖరులోగా పదో తరగతి ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.