Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఈనెల మూడు నుంచి తలపెట్టిన జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని వాయిదా వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని టీఎస్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి చందూరి రాజిరెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి బడిబాట నిర్వహిస్తే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయని తెలిపారు. లేకపోతే తూతూమంత్రంగా జరపాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎండులు ఎక్కువగా ఉండడం, ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు ఈనెల 18 వరకు జరుగుతాయని తెలిపారు. పదో తరగతి విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం గురువారం నుంచి ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.