Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తుల సమర్పణ గడువు 4 వరకు పొడిగింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసే గడువును ఈనెల నాలుగో తేదీ వరకు ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 3,54,635 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఏప్రిల్ 26వ తేదీన 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు షెడ్యూల్ ప్రకారం బుధవారంతో ముగిసింది. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈనెల నాలుగో తేదీ వరకు పొడిగించామని తెలిపారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,86,740 మంది, సవరణ చేసుకున్న వారు 3,77,352 మంది కలిపి మొత్తం 5,64,092 మంది అభ్యర్థులు వివరాలను అప్లోడ్ చేశారని వివరించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.