Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రొఫెసర్ కోదండరాం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆత్మగౌరవ తెలంగాణ కోసం ఈ నెల ఆరున ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద దీక్ష చేయనున్నట్టు తెలంగాణ జన సమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా గురువారం నాంపల్లిలోని టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగురేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణను ఒక వ్యక్తి శాసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, స్వావలంబన, ప్రజాస్వామిక తెలంగాణ కోసం మరో పోరాటం అవసరమనీ, ఇందుకోసం ఉద్యమకారులు, ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఆంధ్ర దోపిడీదారుల రాజ్యం ఇంకా నడుస్తున్నదన్నారు. దీక్షకు ఉద్యమకారులందరిని ఆహ్వానించినట్టు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.