Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ నడుపుతున్న 35 గురుకుల జూనియర్ కాలేజీల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ఆర్జేసీ సెట్ రాతపరీక్ష ఈనెల ఆరో తేదీన సోమవారం జరగనుంది. ఈ మేరకు ఆ సంస్థ కార్యదర్శి సిహెచ్ రమణకుమార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంగ్లీష్ మీడియంలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీలో 35 జూనియర్ కాలేజీల్లో ప్రవేశం కోసం పదో తరగతి పరీక్షలకు హాజరౌతున్న రాష్ట్రంలోని 40,281 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. హైదరాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, సంగారెడ్డి జిల్లా కేంద్రాల్లో ఈనెల ఆరో తేదీన ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. http://tsrjdc.cgg.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటిలో ఏమైనా తప్పులుంటే కేటాయించిన పరీక్షా కేంద్రంలో సంబంధిత ధృవీకరణ పత్రంతో సరిచేసుకోవాలని కోరారు.