Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరణించిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియో
- గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కర్నాటక రాష్ట్రంలోని కాల్బుర్గిలో జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు మరణించటం పట్ల తీవ్ర సంతాపాన్నీ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియోను, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. ఈ సాయం వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలంటూ సీఎస్ సోమేశ్కుమార్ను ఆదేశించారు. అధికారులతో సమన్వయం చేసుకోవటం ద్వారా మరణించిన వారి భౌతిక కాయాలను స్వస్థలాలకు తరలించటం, క్షతగాత్రులకు వైద్యసాయాన్ని అందించటం తదితర చర్యలు చేపట్టాలని మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస యాదవ్కు ఆయన సూచించారు.