Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎన్ని అడ్డంకులనైనా ఎదుర్కొని పార్లమెంటులో బీసీ బిల్లును సాధిస్తామని బీసీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాసు సురేశ్ పేర్కొన్నారు. రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య ఎంపిక కావటం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. అయితే బీసీల ఎదుగుదలను ఓర్వలేని కొందరు అగ్రవర్ణ పెత్తందారులు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే ఆయనపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.