Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఎన్జీవో మాజీ అధ్యక్షులు స్వామినాథన్ అకాల మరణం పట్ల టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షులు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి ఆర్ ప్రతాప్, టీజీవో అధ్యక్షులు వి మమత, ప్రధాన కార్యదర్శి ఎ సత్యనారాయణ సంతాపం ప్రకటించారు. 24 ఏండ్లపాటు టీఎన్జీవో అధ్యక్షులుగా పనిచేశారని వివరించారు. 610 జీవోను 1985లో సాధించారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయనతో ఉన్న అనుబంధం విడదీయరానిదని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన జీవితాన్ని ఉద్యోగుల సంక్షేమం కోసం దారపోశారని పేర్కొన్నారు. ఆయన చిరుకాలం ఉద్యోగుల గుండెల్లో నిలిచిపోతారని తెలిపారు.