Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు 3.63 లక్షల దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో గ్రూప్-1 పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు గడువు శనివారం అర్థరాత్రితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,63,974 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కార్యదర్శి అనితా రామచంద్రన్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్ను ఏప్రిల్ 26న టీఎస్పీఎస్సీ విడుదల చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల సమర్పణకు తుదిగడువు శనివారం అర్థరాత్రి వరకే అవకాశమున్నదని పేర్కొన్నారు. వన్టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్)కు సంబంధించి కొత్తగా 1,90,163 మంది, సవరణ చేసుకున్న వారు 3,83,319 మంది కలిపి మొత్తం 5,73,482 మంది అభ్యర్థులు వివరాలను అప్లోడ్ చేశారని వివరించారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.