Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ,సూర్యపేట: నేడు స్థానిక జిల్లా బాల భవన్ ను జిల్లా విద్యాశాఖాధికారి కే అశోక్ గారు పర్యవేక్షించగా క్రాఫ్ట్ శిక్షణ పొందుతున్న స్టూడెంట్స్ పేపర్ తో చేసిన క్రాఫ్ట్ బుకే అందించి స్వాగతం పలికారు. .ప్రతి విభాగశీ లో శిక్షణ పొందుతున్న చిన్నారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు, అనంతరం చిన్నారుల నృత్య ప్రదర్శన తిలకించి మెచ్చుకున్నారు,ఆగస్త్య ఫౌండేషన్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన సైన్స్ ప్రయోగాలు లెక్కల మెళకువలు శిక్షణను, సంచార ప్రయోగ శాల వాహనాన్ని పరిశీలించి సిబ్బంది వీరేశం, విద్యా సాగర్ లను అభినందించారు. బాల్ భవన్ సూపరింటెండెంట్ బండి రాధాకృష్ణ రెడ్డి తన పుట్టిన రోజు సందర్భంగా పర్యావరణ పరిరక్షణ లో భాగంగా చిన్నారులకు తెలంగాణ విద్యాశాఖ బాల్ భవన్ పేరుతో క్లాత్ బ్యాగ్స్ చేయించి బహుమతిగా అందించడానికి విద్యాశాఖ అధికారి అశోక్ గారి చేతుల మీదుగా ప్రారంభం చేశారు . తదుపరి డి ఈ ఓ గారు మాట్లాడుతూ చదువుతోపాటు లలిత కళలు,క్రీడలు శిక్షణ తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా అందుబాటులో ఉన్నాయి అని,మరెక్కడా లేని విధంగా సామగ్రి అందుబాటులో వుందని కొనియాడారు , బాల్ భవన్ లో ఏర్పాటు చేసిన అన్ని సౌకర్యాలు పరిశీలించారు,శిక్షణ బావుందని బాల్ భవన్ స్టాఫ్ అందరినీ అభినందించారు,ఈసారి ప్రత్యేకంగా కలెక్టర్ గారు స్నాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని,కాబట్టి బాల బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు .వేసవి శిక్షణ క్యాంప్ ముగింపు లో సర్టిఫికేట్ తో పాటు ఈసారి పర్యావరణ పరిరక్షణ కోసం గుడ్డ సంచులు అందివ్వడం ఆలోచన బావుంది ఆనీ, ఎందరికో రోల్ మోడల్ గా బాల్ భవన్ సర్వీస్ నిలుస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బాల్ భవన్ సిబ్బంది దాసరి ఎల్లయ్య, ఉమా, సత్యనారాయణ సింగ్, అనిల్, సాయి, వీరు నాయుడు, పద్మ, సునీత మరియు స్టూడెంట్స్ పేరెంట్స్ పాల్గొన్నారు.