Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 76 మందికి కరోనా
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కొత్తగా 76 మందికి కరోనా సోకింది. శుక్రవారం సాయంత్రం 5.30గంటల నుంచి శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 11,107మందికి టెస్టులు చేయగా బయటపడినట్టు కోవిడ్-19 మీడియా బులెటిన్ వెల్లడించింది. 49 మంది డిశ్చార్జి అయ్యారు. 467 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.రాష్ట్రంలో ప్రస్తుతం 547 యాక్టివ్ కేసు లున్నాయి. వీరిలో ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో 19 మంది చికిత్స పొందుతున్నారు. జిల్లాల వారీగా చూస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 55మందికి కరోనా సోకింది. రాష్ట్రంలో పాజిటివ్ రేటు 0.68 శాతంగా నమోదయింది.