Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్రీడాకారులకు మంత్రుల అభినందనలు
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
బీచ్వాలీబాల్ క్రీడలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను మంత్రులు వీ శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. మే 20 నుంచి 22వ తేదీ వరకు చెన్నై నగరంలో జరిగిన 22 వ అల్ ఇండియా బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో తెలంగాణ క్రీడాకారులు పీ శ్రీకతి, వీ ఐశ్వర్య గోల్డ్ మెడల్ సాధించినట్టు తెలిపారు. వీరు బ్యాంకాక్లో జరిగే ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ ఛాంపియన్ షిప్కి ఎంపికైన సందర్భంగా వారిని మంత్రులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ హరికష్ణ, తెలంగాణ బీచ్ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి హనుమంతు రెడ్డి, కోచ్ అన్వర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.