Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సులతోపాటు ఆర్జీయూకేటీ బాసర త్రిపుల్ఐటీలో ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల ఆరో తేదీవరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్లైన్లో ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు గడువు ఈనెల ఆరో తేదీ వరకు పొడిగించామని తెలిపారు. ఆలస్య రుసుం రూ.100తో అదేనెల ఏడో తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని వివరించారు. జూన్ 30న పాలిసెట్ రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు.అభ్యర్థులు ఇతర పాలిసెట్ ద్వారా జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో అగ్రికల్చర్ కోర్సులు, కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు, పివి నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంలో పశుసంవర్ధక, ఫిషరీస్ కోర్సుల్లో నూ ప్రవేశాలుంటాయని వివరించారు.