Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రోగులకు అవసరమైన అత్యవసర మందులు, రక్తం కోసం వారిని బయటికి పంపొద్దని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్రావు ఆదేశించారు. శనివారం కోఠిలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవసరమైన మందులు, రక్తాన్ని నిరంతరం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. మందులు, ఆహారం తదితరాలు అందుతున్నా యా? అంటూ రోగులను అడిగి తెలుసుకున్నారు. నిరంతరం రోగులకు అందుబాటులో ఉండాలనీ, అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తామనీ, నిధుల విడుదలకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు.