Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం సహా పలువురి సంతాపం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఆంధ్రజ్యోతి తెలంగాణ స్టేట్ బ్యూరో చీఫ్, సీనియర్ జర్నలిస్టు మెండు శ్రీనివాస్ హఠాన్మరణం చెందారు. ఆదివారం పరకాలలో అక్కడ మిత్రులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఆయనకు గుండెపోటు వచ్చింది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శ్రీనివాస్ మృతి చెందారు. మెండు శ్రీనివాస్ హఠాన్మరణంపై సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మరణం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి పత్రిక తరపున టీఆర్ఎస్ పార్టీ సహా... సీఎంవో బీట్ రిపోర్టర్గా శ్రీనివాస్ అందించిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సాను భూతిని తెలిపారు. మెండు శ్రీనివాస్ అకాలమరణం దిగ్భ్రాంతిని కలిగించిం దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటు ంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మెండు శ్రీనివాస్ మరణం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి తదితర ప్రముఖులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. ఆయన మరణం బాధాకరమని మీడియా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ ఆవేదన వ్యక్తం చేసారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నేతలు ఆయన మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పరకాలలో నిర్వహించారు.