Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి హరీశ్ రావు ఆదేశం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అన్ని జిల్లాస్పత్రుల్లో కాటారాక్ట్ ఆపరేషన్లు నిర్వహించాలని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఆయన జూమ్ యాప్ ద్వారా రాష్ట్రంలోని కంటి వైద్యులతో సమీక్ష నిర్వహించారు. వెంటనే క్యాంపులను నిర్వహించాలనీ, అందుకవసరమైన పరికరాలను సమకూర్చుకోవాలని సూచించారు. అవసరమైన వారందరికీ కంటి అద్దాలు పంపిణీ చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.రాజలింగం తదితరులు పాల్గొన్నారు.