Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి ఇండ్ల పట్టాలకు సంబంధించిన జీవో 76 కాలపరిమితిని మరో రెండు నెలల పాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్తో మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్.దివాకర్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఆయన సమావేశమయ్యారు. చెన్నూరు పట్టణంలోని ఆబాది భూముల సమస్యను పరిష్కరించాలని కోరారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని విన్న వించారు. బెల్లంపల్లి పట్టణంలోని ఎస్ఆర్టీ క్వాటర్స్ సమస్యను త్వరతగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ జిల్లాలో ఫారెస్ట్- రెవెన్యూ శాఖల మధ్య నెలకొన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.