Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
''ఉన్నది ఒకటే భూమి. భవిష్యత్ తరాల మనుగడ కోసం దాన్ని పరిరక్షించాలి'' అని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్ కుమార్ జైన్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. పర్యావరణ పచ్చగా ఉంటేనే జీవితాలు సుఖవంతంగా ఉంటాయనీ, దానికోసం ప్రతిఒక్కరూ తమవంతు సహకారాన్ని భూమికి అందించాలని అన్నారు. ఈ సందర్భంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలో పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన వివిధ పనులు, కార్యక్రమాలను ఆయన వివరించారు. అనంతరం పర్యావరణంపై నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందచేశారు.