Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్లోని రవీంద్రభారతిలో సోమవారం 'కోకిలమ్' సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాస శాస్త్రి కథల సభలో ప్రముఖకవి, రచయిత, కార్టూనిస్టు, కాలమిస్టు సుధామ రచించిన జీవన సంధ్య వ్యాస సంపుటిని రచయిత, జ్యోతి మాసపత్రిక పూర్వసంపాదకులు, సాహితీవేత్త తల్లావఝుల శివాజీ ఆవిష్కరించారు. 'వాయిస్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్' మాసపత్రికలో మూడేండ్లకుపైగా వయోధికుల కోసం రాసిన 'సీ'నియర్ కబుర్లు కాలమ్ పేరిట సుధామ వ్యాసాలు రాసిన విషయం విదితమే. వ్యాసాలన్నింటినీ జీవన సంధ్య గ్రంథ రూపంలో తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి ఇంద్రగంటి జానకీబాల, కథారచయితలు వి.రాజారామమోహన్ రావు, దాదాహయాత్, ముక్కామల చక్రధర్ విశిష్ట పాత్రికేయులు గోపీనాథ్, రంగాచారి, కవులు వసీరా, సాంధ్యశ్రీ, పురాణం సుశీల తదితరులు పాల్గొన్నారు.