Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాల కోసం నిర్వహించే లా సెట్ దరఖాస్తు గడువును ప్రభు త్వం పొడిగించింది. ఈ మేరకు లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేశా రు. ఆలస్య రుసుం లేకుండా దర ఖాస్తు చేసే గడువు ఈనెల 16 వరకు పొడిగించామని తెలిపారు. ఆ తర్వాత పొడిగింపు ఉండబో దని స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకుని దరఖాస్తు చే యాలని సూచించారు. ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 26 వరకు, రూ.వెయ్యితో వచ్చేనెల ఐ దు, రూ.రెండు వేలతో 12వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించొ చ్చని కోరారు. మూడేండ్ల లా కో ర్సును వచ్చేనెల 21న, ఐదేండ్ల లా కోర్సు, ఎల్ఎల్ఎంను 22న ని ర్వహిస్తామని వివరించారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యా ర్థులూ దరఖాస్తు చేసేందు కు అర్హులని స్పష్టం చేశారు. ఇతర వివరాలకు https:// lawcet.tsche.ac.inవెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.