Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే కె.పి.వివేకానంద
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
బీజేపీ అంటేనే జూఠా పార్టీగా మారిందనీ, మాటలు తప్ప మోడీ పాలనలో చేతులు లేవని ప్రభుత్వ విప్ ఎం.ఎస్.ప్రభాకర్ రావు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాటలు తప్ప చేతలు లేవన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ఆయుష్మాన్ భారతేనంటూ జెపీ నడ్డా చెప్పడం హాస్యాస్పదమన్నారు. చరిత్రను వక్రీకరించడమే బీజేపీ నేతల పని అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదని అన్నారు.