Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అరగంటలో ఖాళీ
నవతెలంగాణ- భద్రాచలం(బూర్గంపాడు)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం చేపల లోడ్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. చేపలన్నీ నేలమట్టం అయ్యాయి. ఈ సమాచారం దావానంలా వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చేపల కోసం ఎగబడ్డారు. దొరికినకాడికి చేపలు తీసుకుపోయారు. సుమారు అరగంట సమయంలో లారీ లోడ్ చేపలు మాయమయ్యాయి. ఇదిలా ఉండగా, బోల్తా పడిన లారీలో నిషేధిత క్యాట్ ఫిష్ను తరలిస్తున్న విషయం బయటపడింది. బుధవారం నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుండటంతో ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి నాగపూర్కు ఈ నిషేధిత క్యాట్ ఫిష్ను తరలిస్తున్నారని సమాచారం. హైదరాబాద్ మీదుగా వెళ్తే వాహన తనిఖీలు ఉంటాయని మణుగూరు మీదుగా నాగపూర్కు తరలించే క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని ప్రచారం సాగుతోంది. సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని లారీని పోలీసు స్టేషన్కు తరలించారు. చేపల తరలింపుకు అనుమతులు ఉన్నాయా లేదా అనే విషయంపై విచారణ చేస్తున్నారు.