Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇప్పటి వరకు 1.13 లక్షల దరఖాస్తులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు నిర్వహించే పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) దరఖాస్తుల స్వీకరణ గడువు బుధవారంతో ముగిసింది.
ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణా మండలి (ఎస్బీటీఈటీ) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ డాక్టర్ సి శ్రీనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 1,13,406 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని వివరించారు. ఈనెల 30న పాలిసెట్ రాతపరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు. పరీక్ష జరిగిన 12 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తామని తెలిపారు. అభ్యర్థులు ఇతర వివరాల కోసం sbtet. telangana. gov.in,www.polycetts.nic.in వెబ్సైట్లను, 040- 23222192 ఫోన్ నెెంబర్ను సంప్రదించాలని సూచించారు.