Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2022-23 విద్యాసంవత్సరంలో ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రy ేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మే రకు మోడల్ స్కూళ్ల ప్రాజెక్టు డైరెక్టర్ జి ఉషారాణి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆరో తరగతిలో పాఠశాలకు వంద సీట్లుంటాయని, ఏడు నుంచి పదో తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు ప్రవేశ పరీక్ష నిర్వహించామని వివరించారు. ఆరో తరగతి ప్రవేశాలకు 39,505 మంది, ఏడు నుంచి పదో తరగతి వరకు 33, 696 మంది కలిపి మొత్తం 73,201 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారనీ, వారిలో 63,245 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు.