Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉన్నత విద్యామండలి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఇంజినీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా, ఇతర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షలకు అభ్యర్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. ఎంసెట్కు 2,61,616 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 17 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని వివరించారు. ఈసెట్కు 22,549 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఆలస్య రుసుం రూ.500తో ఈనెల 14 వరకు దరఖాస్తు చేయొచ్చని సూచించారు. ఐసెట్కు 30,941 మంది దరఖాస్తు చేశారని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 27 వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశముందని వివరించారు. లాసెట్కు 24,242 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 16 వరకు దరఖాస్తు చేసేందుకు గడువుందని తెలిపారు. ఎడ్సెట్కు 16,437 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని పేర్కొన్నారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 15 వరకు దరఖాస్తు చేసే గడువుందని వివరించారు. పీఈసెట్కు 1,128 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారని తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఈనెల 18 వరకు దరఖాస్తు చేయొచ్చని సూచించారు. వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందే అభ్యర్థులు సకాలంలో దరఖాస్తు చేయాలని కోరారు.