Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాతావరణ శాఖ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నైరుతి రుతుపవనాలు ఏపీలో ప్రవేశించటానికి మరో రెండు రోజులు పట్టే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత తెలంగాణలోకి అవి ప్రవేశిస్తాయని డైరెక్టర్ నాగరత్న పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కోస్తా తీరం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి గురువారం తెలంగాణ నుంచి దూరంగా వెళ్లింది. దీంతో రుతుపవనాలు ముందుకు సాగడానికి అనుకూల పరిస్థితులున్నాయి. రాబోయే 48 గంటల్లో గోవా, కర్నాటక, దక్షిణ ఏపీలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఆమె తెలిపారు. రాయలసీమ జిల్లాల్లోకి ప్రవేశించిన తర్వాత తెలంగాణలోకి రుతుపవనాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ నెల 13 వరకు రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.