Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్సీ బండ ప్రకాశ్కు ముదిరాజ్ సంఘం ప్రతినిధుల వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఉచిత చేపపిల్లల సరఫరాలో స్థానికులకు అవకాశం కాల్పించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ యువజన విభాగం ప్రతినిధులు కొంత మంది ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ను కోరారు. ఆదివారం హైదరాబాద్లో ఆయన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఉచిత చేపపిల్లల పథకంలో చేపవిత్తనాల సరఫరాను అర్హులకు కేటాయించాలని కోరారు. ఆంధ్రా ప్రాంతానికి చెందిన కాంట్రాక్టర్లకు ఎలాంటి అవకాశాలు కల్పించరాదని విజ్ఞప్తిచేశారు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్ కుమార్, బండా ప్రకాశ్ వారికి భరోసా ఇచ్చారు. తెలంగాణ మత్య్స శాఖకు సంబంధిత మంత్రితో సంప్రదించిన అనంతరం అవసరమైన ఆదేశాల ను జారీ చేస్తామన్నారు. కార్యక్ర మంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ సలహాదారులు పిట్టల రవీందర్, యువజన విభాగం అధ్యక్షుడు డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్, ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్ ముదిరాజ్, పండుగ బాలు ముదిరాజ్, బొక్కా శ్రీను ముదిరాజ్, బిల్లు సత్తయ్య, గొడుగు శ్రీనివాస్ ఉన్నారు.