Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు కవిత్వాన్ని మహౌన్నత స్థాయిలో నిలిపారని రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.సినారె వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.దక్కనీ ఉర్దూ,తెలుగు భాషా సాహిత్యాల ను జుగల్బందీ చేసి,గజల్స్తో అలారు బలారు తీసుకొని, తెలంగాణ గడ్డమీద గంగా జమునా తెహజీబ్కు ఆయన సాహిత్యం చిరునామాగా నిలిచారని చెప్పారు. భాష, సాహిత్యం నిలిచివున్నన్నాళ్ళూ ప్రజల హృదయాల్లో ఆయన నిలిచివుంటారని పేర్కొన్నారు.