Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీపీసీసీ అధికార ప్రతినిధుల సమావేశంలో నిర్ణయం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
నేషనల్ హెర్డాల్ పత్రిక ఆస్తుల విషయంలో సోనియా, రాహుల్గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు ఇవ్వడాన్ని టీపీసీసీ ఖండించింది. దీనికి నిరసనగా సోమవారం ఈడీ కార్యాలయం వద్ద నిర్వహించనున్న నేపథ్యంలో ఆదివారం గాంధీభవన్లో అధికార ప్రతినిధులతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్కుమార్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్ విషయంలో లోతుగా అధ్యయనం చేసుకోవాలని అధికార ప్రతినిధులకు సూచించారు. తాజా రాజకీయ అంశాలు, ప్రధాన అంశాలపై ఎప్పటికప్పుడు చర్చలకు సిద్ధంగా ఉండాలని కోరారు. ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు వేంనరేందర్రెడ్డి, అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, బెల్లయ్య నాయక్, అయోద్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.