Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ను కించపరచడం సరికాదు
- కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు వ్యతిరేకంగా విష ప్రచారం చేస్తున్న 'శబ్ది డాట్ కం' ఆన్లైన్ పోర్టల్ను తక్షణం నిషేధించాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జాన్వెస్లీ, టి స్కైలాబ్బాబు సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఆ పోర్టల్ ద్వారా అంబేద్కర్పై పచ్చి అబద్దాలతో కూడిన దుష్ప్రచారం జరుగుతున్నదని తెలిపారు. ఆయన అబద్దాల కోరనీ, రేపిస్టనీ తదితర దుర్మార్గ నిందా ప్రచారాన్ని చేయటాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.ఇది కుల దరుహంకారం తప్ప మరొకటి కాదని తెలిపారు. ఇది మనువాద, మతోన్మాద హస్తకళగా కనిపిస్తున్నదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అంబేద్కర్ ఆశయాల విరోధిగా అనేక దుర్మార్గాలకు పాల్పడుతున్నదని పేర్కొన్నారు. ఈ ప్రచారాన్ని ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు.